- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని కలిగొట్ గ్రామంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు ఉచితంగా ఇవ్వడం జరిగిందని పశువైద్యాధికారి అశ్రిత తెలిపారు. 324 గేదెలకు, 98 ఆవులకు గాలికుంటు నివారణ టీకాలు ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్రులు పోశెట్టి, రాజ్ కుమార్, రైతులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -