– పోరాడి ఓడిన సాత్విక్, చిరాగ్
– సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్
సింగపూర్ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ సింగపూర్ ఓపెన్ టైటిల్ వేట సెమీఫైనల్లోనే ముగిసింది. క్వార్టర్ఫైనల్లో వరల్డ్ నం.1 మలేషియా జోడీని చిత్తు చేసిన సాత్విక్, చిరాగ్లు సెమీఫైనల్లో వరల్డ్ నం.3 జోడీ చేతిలో పరాజయం పాలయ్యారు. 64 నిమిషాల పాటు ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్లో 21-19, 10-21, 18-21తో సాత్విక్, చిరాగ్ జోడీ పోరాడి ఓడింది. తొలి గేమ్లో 11-8తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన అదే జోరు కొనసాగించింది. 18-18తో మలేషియా షట్టర్లు ఆరోన్ చియా, యిక్లు స్కోరు సమం చేసినా.. వరుస పాయింట్లతో 21-19తో సాత్విక్, చిరాగ్లు 1-0 ఆధిక్యం సాధించారు. కీలక రెండో గేమ్లో సాత్విక్, చిరాగ్లు తేలిపోయారు. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేని సాత్విక్, చిరాగ్లు 10-21తో రెండో గేమ్ను కోల్పోయి మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో గేమ్కు తీసుకెళ్లారు. డిసైడర్లోనూ 6-6 తర్వాత డీలా పడిన సాత్విక్, చిరాగ్లు అంచనాలను అందుకోలేదు. వరుస పాయింట్లతో ఆధిక్యంలో నిలిచిన మలేషియా షట్లర్లు 21-18తో మూడో గేమ్తో పాటు ఫైనల్లో బెర్త్ను దక్కించుకున్నారు.
సెమీస్లో నిరాశ
- Advertisement -
- Advertisement -