Wednesday, September 17, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో సీట్ల సర్దుబాటుపై చర్చలు

బీహార్‌లో సీట్ల సర్దుబాటుపై చర్చలు

- Advertisement -

త్వరలోనే ఒప్పందం
కేరళలో పరిస్థితులు అనుకూలం
మళ్లీ మాదే అధికారం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీహార్‌లో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయనీ, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ బేబి అన్నారు. కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి అన్ని అవకాశాలు, పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ”ఐదేండ్ల క్రితం కేరళలో అధికారంలోకి వచ్చిన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం గొప్ప చరిత్రను సృష్టించింది. ఇప్పుడు ‘కొనసాగింపు కోసం కొనసాగింపు’ అనే కొత్త చరిత్రను రాయాల్సిన సమయం ఆసన్నమైంది. దానికి అవసరమైన అవకాశాలున్నాయని పార్టీ అంచనా వేస్తోంది. ఎన్నికలను ఎదుర్కొనేందుకు సీపీఐ(ఎం), ఎల్‌డీఎఫ్‌ అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాయి” అని ఎంఏ బేబి పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశ నిర్ణయాలను వివరించడానికి మంగళవారం ఏకేజీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ సహా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో సీపీఐ(ఎం), ఫ్రంట్‌ల సన్నాహాలను కేంద్ర కమిటీ జాగ్రత్తగా పరిశీలించిందని తెలిపారు. రాజకీయంగా, సంస్థాగతంగా ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ యూనిట్లు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని, పార్టీకి నివేదికలు కూడా అందాయని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ఇటీవల గొప్ప పురోగతి సాధించిందని, పార్టీ ర్యాలీలలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

కేరళలో సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ
దేశంలో కేరళ అత్యంత సమర్థవంతమైన పోలీసు వ్యవస్థను కలిగి ఉందని ఎం.ఎ బేబి అన్నారు. ”పెద్ద నేరాలను నిరూపించడంలో, నేరస్థులను పట్టుకోవడంలో కేరళ పోలీసులు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన నమూనా. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ పోలీసు విధానం పూర్తిగా భిన్నమైనది. 1957లో ఈఎంఎస్‌ ప్రభుత్వ కాలం నుంచి అది అలాగే ఉంది. అప్పటి వరకు, పోలీసులు ప్రభువులకు, పెట్టుబడిదారులకు సేవకులుగా పని చేశారు. 1957లో ఈఎంఎస్‌ ప్రభుత్వం ఆ వ్యవస్థను మార్చింది. కానీ, అప్పుడు కూడా, శాండల్‌వుడ్‌ గ్రోవ్‌ కాల్పులు వంటి కొన్ని సంఘటనలు జరిగాయి. ఇప్పుడు, కొన్ని సమస్యలు తలెత్తాయి. కానీ, అది ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ పోలీసు విధానం యొక్క సమస్య కాదు. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ పోలీసు విధానం నుంచి కొన్ని అంశాల కారణంగా ఇది జరిగింది. వాస్తవానికి, ఏమి జరిగిందో అసెంబ్లీలో వివరంగా చర్చించబడింది. జనమైత్రి పోలీసుల విధానం కేరళ పోలీసుల నుంచి ఆశించబడింది. దాని కోసం హౌం శాఖ కూడా జోక్యం చేసుకుంటోంది. ఇక్కడ, అక్కడ జరిగిన కొన్ని ఘటనలను ఎత్తిచూపడం ముఖ్యం కాదు’ అని ఎంఎ బేబీ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -