నవతెలంగాణ – భీంగల్ : భీంగల్ మండలంలోని బాలికల ఉన్నంత పాఠశాలలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పాఠ్యపుస్తల కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నిజామాబాద్ జిల్లా సయ్యద్ రహమాన్ ముఖ్యఅతిథిగా హాజరై మండల విద్యాశాఖ అధికారి స్వామి ఉపాధ్య బృందంతో కలిసి విద్యార్థులకు పాఠ పుస్తకాలు అందించారు.ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రహమాన్ మాట్లాడుతూ. విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉన్నంత స్థాయికి ఎదగాలని అన్నారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని వంటవారికి సూచించారు. అలాగే మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వం కావున విద్యార్థులు పాఠశాలలో చేరి అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు మండల విద్యాశాఖ అధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బృందం తదితరులు పాల్గొన్నారు.సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లింబాద్రి, రఘువాస్, జాన్ విల్సన్, రాజేందర్, వినోద్ కుమార్, రమణ, రాములు, రాధిక,రాజ్ కుమార్, శివకుమార్, వాసుదేవ్, వినోద్ సాగర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యార్థులకు పుస్తకాలు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES