- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
పశువైద్య , పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బాల్కొండ మండల పరిధిలోని బస్సాపూర్, కిసాన్ నగర్ గ్రామాలలో గురువారం నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు పశువైద్య అధికారి డా. ఉజ్వల తెలిపారు. ఈ మందులను బస్సాపూర్ గ్రామ సర్పంచ్ పి. శ్రీనివాస్, కిసాన్ నగర్ సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్, ఉప సర్పంచ్ స్వామినాథ్ చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు ఉజ్వల తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవాల పెంపకం దారులు, గోపాలమిత్ర ప్రణీత్, సబర్డినేట్ షకీల్ , బషీర్, పశుమిత్ర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు .
- Advertisement -



