- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : మండలంలోని పొన్కల్ గ్రామపంచాయతీ పరిధిలోని అక్కపల్లి గూడ, పొనకల్ లోని ప్రైమరీ స్కూల్ల లోని విద్యార్థులకు పీ సీ ఆర్ ( పూర్ణచందర్రావు )ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మాట్లాడుతూ.. అక్క పెల్లి గూడ ప్రైమరీ స్కూల్ లో 25మంది విద్యార్థులకు, పొనకల్ ప్రైమరి స్కూల్ లో 12 మంది విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా బ్యాగులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాగుల శంకర్, ప్రశాంత్,మూల భాస్కర్ గౌడ్, గంగన్న యాదవ్,దుర్గం తిరుపతి, స్కూల్ హెడ్ మాస్టర్లు జాజల శ్రీనివాస్, రాజేశం, టీచర్ శ్రీకాంత్ తదితరులు లు పాల్గొన్నారు.
- Advertisement -