నవతెలంగాణ-బాన్సువాడ(నసురుల్లాబాద్)
బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ మరియు టెంపుల్ రోడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పీఎస్ఆర్ నిర్మాణపు కంపెనీ యజమాని పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచులను అందించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలకు సేవ చెయ్యడం అలవాటు చేసుకోవాలని, పీఎస్ఆర్ సంస్థ పోచారం సురేందర్ రెడ్డి విద్యార్థులకు పెంచిన వితరణ చేయడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారి శ్రీ నాగేశ్వర్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, మహేందర్, మాజి ఎంపీటీసీ పద్మ వీరేశం, మాజీ సర్పంచులు పద్మ మొగులయ్య,నాయిని మొగలయ్య, భీమ గంగారాం,గ్రామ సెక్రటరీ నర్సింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ భీమ రాము ,ఉపాధ్యాయులు శ్యామ్ గౌడ్, ప్రసన్న జ్యోతి, మరియు పెద్దలు గులేపల్లి మోగులయ్య, గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.