డీఎల్పీఓ సత్యనారాయణ రెడ్డి
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
సమాజంలోని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకై మట్టి విగ్రహాలు పూజించి కంకణ బద్దులు కావాలని స్థానిక సంస్థల డీఎల్పీఓ సత్తయనారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు భాస్కరరావు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మట్టి వినాయకునికి వాడటం వల్ల జరిగే ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి లోపలతో పాటు వివిధ మండపాలలో భారీ విగ్రహాలను మట్టితో చేయించినప్పుడు పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. ఈ ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి,కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తుల పాల్గొన్నారు.
మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES