నవతెలంగాణ-తొగుట : పొద్దు తిరుగుడు దాన్యం డబ్బులు చెల్లించ కుంటే పురుగుల మందే శరణ్యమని రైతులు అవేదన వ్యక్తం చేశారు. గురువారం పొద్దు తిరుగుడు ధాన్యం అమ్మి 75 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించకపోవడాన్ని నిర సిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ డబ్బులు చెల్లించే తహతు లేనప్పుడు పొద్దు తిరుగుడు ధాన్యం ఎందుకు కొనుగోలు చేశారని నిలదీశారు. పంట పెట్టుబడుల కోసం డబ్బులు లేక కష్టాల పాలవుతున్నామని అవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన కు బీఆర్ఎస్ నాయకు లు సంఘీభావం ప్రకటించి దర్నాలో పాల్గొన్నారు. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫ లమైందని కాన్గల్ సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి, బీఅర్ఎస్ మండల పార్టీ అధ్యక్షు డు జే. రాం రెడ్డి లు. పేర్కొన్నారు. పొద్దు తిరుగు డు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నుండి మొదలు కొని ధాన్యం కొనుగోలు కార్యక్ర మం వరకు అనేక ఇబ్బందులు ఏదురు కొంటున్న మని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొగుట కొనుగోలు కేంద్రం పరిధిలో 400 మంది రైతులకు గానూ రూ. 3 కోట్ల బకాయిలు ఉన్నా యన్నాయని అన్నారు. రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాం డ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో మార్పు అంటే రైతు లు ధాన్యం అమ్మి డబ్బుల కోసం రోడ్డుమీదికి రావాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. రైతును రాజుగా చేస్తామని రోడ్డుమీదికి తెస్తున్నా రని ఏద్దేవా చేశారు. రైతు భరోసా, రుణమాఫీ అసంపూర్తిగా ఉందన్నారు. ఎన్నికలు రాగానే సీఎం రేవంత్ రెడ్డి కి రైతులు యాదికి వొస్తున్నార ని, నాడు ఎంపీ ఎన్నికల్లో రుణమాఫీ, నేడు పంచా యతీ ఎన్నికల సందర్బంగా రైతు భరోసా ఇస్తున్నా రని దుయ్యబట్టారు. పోలీసులు సర్ది చెప్పి డంతో రైతుల ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, మాజీ మార్కె ట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, మండల పార్టీ మాజీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, నాయ కులు మంగ నర్సింలు, పబ్బతి వెంకట్ రెడ్డి, మంగ యాదగిరి, తగరం అశోక్, బండారు స్వామి గౌడ్, పిట్ల వెంకటయ్య, బీజేవైఎమ్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పొద్దు తిరుగుడు ధాన్యం డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES