- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందజేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ కౌన్సిలర్ అభ్యర్థి నందిపేట తులసి తిరుపతయ్య సమీక్షంలో నాగవరం తండా 11వ వార్డు చెందిన సభవత్ లక్ష్మిw/o వెంకటేష్ నాయక్, సభవత్ అంజలి భర్త శంకర్, లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



