- Advertisement -
నవతెలంగాణ – మోపాల్: బోర్గాం(పి) గ్రామంలో మంగళవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, భూపతిరెడ్డి నాయకత్వంలో గ్రామాల్లో నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతూ సీఎంఆర్ చెక్కులు కూడా అనునిత్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, అశోక్, మాజీ ఎంపీటీసీ రఘు పటేల్, అనిల్ రెడ్డి మహేందర్, శ్రీనివాస్, ఎల్లయ్య, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -