– రూ.2లక్షల విలువైన 50 డ్యూయల్ డిస్క్ బెంచ్ అందజేత
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో డ్యూయల్ డిస్క్ బెంచీల వితరణ చేశారు. ఈ మేరకు పాఠశాలలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్స్ యజమాని ఏనుగు దయానంద రెడ్డి పాఠశాలకు రూ.2లక్షల విలువగల 50 డ్యూయల్ డిస్క్ బెంచ్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్ మాట్లాడుతూ వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్స్ యాజమాన్యం ఫిజికల్ డైరెక్టర్ రాజకుమార్ సహకారంతో, ఫిజికల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ సమక్షంలో పాఠశాలకు రూ.2లక్షల విలువైన డ్యూయల్ డిస్క్ బెంచ్ లను అందించడం అభినందనీయమన్నారు. పాఠశాలకు చేయూతనందించిన వసంత టూల్స్ అండ్ క్రాఫ్ట్స్ యజమాని ఏనుగు దయానంద రెడ్డికి పాఠశాల విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు నేల హరీష్, మాజీ ఎంపిటిసి సభ్యుడు డాక్టర్ మురళి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలకు డ్యూయల్ డిస్క్ బెంచీల వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES