నవతెలంగాణ-జక్రాన్ పల్లి
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు పుస్తకాలు మరియు ఏకరూప దుస్తులు పాఠశాల విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు జక్రాన్ పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జక్రాన్ పల్లి మండలంలో అన్ని పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు మరియు ఏకరూప దుస్తులు అందించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలను మొదటి రోజు నుండి బోధన తరగతులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సాయిలు, రామకృష్ణ, గంగాధర్, నరసింహారావు, సునీత, మాలతి, కృష్ణ, మర్కంటి గంగా మోహన్,గౌతమి, ఓఎస్ శేఖర్ లు పాల్గొన్నారు.
ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఎకరూప దుస్తుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES