- Advertisement -
నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలంలోని నాగేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలోఉప సర్పంచ్ యాసం సతీష్ వివాహ దినోత్సవం సందర్భంగా.. విద్యార్థులకు ఆటల సామగ్రి,పండ్లు,పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, మా వివాహ మహోత్సవం సందర్భంగా విద్యార్థుల ఆటలకు సంబంధించిన సామాగ్రి అందించడం మాకు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



