- Advertisement -
నవతెలంగాణ – మోపాల్ : మోపాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం రోజున జీలుగు విత్తనాలను సొసైటీ చైర్మన్ గంగారెడ్డి మరియు వ్యవసాయ అధికారి సౌమ్య పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. రైతులు పెస్టిసైడ్ వాడకాన్ని తగ్గించి జీలుగు జింకు వంటి పచ్చి రొట్టెను వాడాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మోపాల్ క్లస్టర్ ఏఈఓ రంజిత్, సీఈఓ సాయి చంద్, డైరెక్టర్లు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -