- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శుక్రవారం వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో రైతులకు సొసైటీ చైర్మన్ రాజా గౌడ్ జిలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిలుగు విత్తనాలు కావలసిన రైతులు ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ సొసైటీకి తీసుకువచ్చి సబ్సిడీ జిలుగు విత్తనాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ విఠల్, ఏఎంసీ వైస్ చైర్మన్ స్వామి, సీఈఓ మోహన్, డైరెక్టర్లు, తదితరులు ఉన్నారు.
- Advertisement -