నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న మైక్ సెట్ వితరణ చేశారు. పాఠశాలలో గత కొంత కాలం కిందట మైక్ సెట్ పాడయ్యింది.పాఠశాలలో ఉదయం, సాయంత్రం జరిగే ప్రార్థన కార్యక్రమంలో, పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో మైక్ సెట్ లేకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పలు కార్యక్రమాల్లో విద్యార్థులు అంత ఉత్సాహంగా పాల్గొనడం లేదని ఇటీవల ఒక కార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కమ్మర్ పల్లి ఉపాధ్యక్షులు సుంకేట బుచ్చన్న దృష్టికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న తీసుకెళ్లారు. స్పందించిన ఆయన విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలకు ఒక మైక్ సెట్ ను వితరణ చేశారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మైక్ సెట్ ను విద్యార్థుల సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్నకు అందజేశారు. అడిగిన వెంటనే పాఠశాలకు మైక్ సెట్ ను అందించిన బుచ్చన్నకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు నూకల బుచ్చి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలకు మైక్ సెట్ వితరణ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES