- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లాడేగావ్ గ్రామంలో మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సతీష్ పటేల్ ఆధ్వర్యంలో జుక్కల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సతీష్ పటేల్, గోవింద్ పటేల్ మాట్లాడుతూ.. గత కొన్ని ఏండ్లుగా రేషన్ కొత్త రేషన్ కార్డులు రాక, కొత్తగా పుట్టిన వారి పేర్లు నమోదు కాక సతమతమవుతున్న గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నూతన కార్డుల పంపిణీ కార్యక్రమం చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -