- Advertisement -
– తాసిల్దార్ జుగుంట సురేష్ బాబు
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలో రేపు మంగళవారం ఉదయం 10 గంటలనుండి రైతు వేదిక భవనం వెనుక, ఆర్టీసీ కాంప్లెక్స్ లో మంత్రి సీతక్క చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు స్థానిక తాసిల్దార్ జుగుంట సురేష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్ బాబు మాట్లాడుతూ కొత్తగా అప్లై చేసుకున్న 1299 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మేరకు పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నూతన రేషన్ కార్డుకు అప్లై చేసిన వారందరూ సకాలంలో వచ్చి మంత్రి చేతుల మీదుగా రేషన్ కార్డులు పొందాలని కోరారు.
- Advertisement -