- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని వజ్రకండి గ్రామంలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను గ్రామ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు అధ్యక్షుడు జైపాల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలలో రేషన్ కార్డుల పంపిణీ జోరుగా కొనసాగుతుందని అన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు రావడంతో లబ్ధిదారులు ఆనందంలో మునిగితేలారు. కొత్త రేషన్ కార్డులను చూసి లబ్ధిదారుల ఆనందానికి ఆవధులు లేకుండా పోయింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -