విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ..

నవతెలంగాణ – ఆర్మూర్ 

మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆరు నుండి పదవ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలు బుధవారం వితరణ చేసినారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొంతుల రవీందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సరఫరా చేసిన నోటు పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మోతే మోహన్, విటల్, శోభ, లింబాద్రి, భాను ప్రకాష్ ,,గంగామోహన్, లావణ్య, వీడీసీ సభ్యులు ఆకుల లక్ష్మణ్, గంగారం, రాజన్న, ఎండి సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love