- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి: మండల కేంద్రంలో ఆదివారం పద్మజాలి సంఘం శిక్షణ సమితి ఆధ్వర్యంలో ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు చదువుతున్న, పద్మశాలి సంఘం కుల బాంధవుల విద్యార్థులకు నోటు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దోమల శ్రీధర్, సెక్రటరీ సుప్పని రవి, శిక్షణ సమితి అధ్యక్షులు ఎల్లగొండ సంతు, కార్యదర్శి మాదాసు శ్రీనివాస్, సంఘ ఉపాధ్యక్షులు కాముని కృష్ణ, కోశాధికారి భూపతి శ్రీనివాస్, సంఘ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -