నవతెలంగాణ – గోవిందరావుపేట : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం” అను కార్యక్రమాన్ని ములుగు జిల్లా, గోవిందరావుపేట మండల కేంద్రంలో కార్యక్రమాన్ని రైతు వేదికలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో స్థానిక పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరియు ప్రొఫెసర్ డా. బి.విద్యాదర్ “ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం” కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి ఎల్లారెడ్డి మాట్లాడుతూ విత్తుకొద్దీపంట నాణ్యమైన విత్తనం మంచి దిగుబడులు సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అని అలాగే ఈ వరి వంగడం డబ్ల్యూ జి ఎల్ -962 యొక్క గుణ గుణాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలాల్లోని ఇద్దరేసి రైతులకు 10 కిలోల వరి విత్తన కిట్లను అందజేశారు. తదనంతరం వరి పంటలో సాగు మెలకువలను తెలిపారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం ప్రొఫెసర్ డా.బి. విద్యాధర్, డా.జె.కమలాకర్, డా. ఎం. మధు మరియు మండల వ్యవసాయ అధికారి జితేంద్ర రెడ్డి, వివిధ క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES