- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని తహసిల్దార్ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా పట్టణ తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ .. ప్రభుత్వం ఈసారి 3 నెలల బియ్యాన్ని పంపిణీ చేస్తోందన్నారు. ఈనెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ చేయాలని మండలంలోని రేషన్ డీలర్లకు ఆదేశాలు ఇవ్వనున్నామన్నారు. దీని పట్ల లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్నారు.
- Advertisement -