- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : కేంద్ర కారాగారము, నిజామాబాదులో పర్యవేక్షణాధికారి చింతల దశరథం ఆధ్వర్యములో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా జైలు అధికారులకు, సిబ్బందికి, ఖైదీలకు ములాఖతునకు వచ్చినవారి కుటుంబ సభ్యులకు కూడా పర్యవేక్షణాధికారి చేతుల మీదుగా సీడ్ బాల్స్ ను పంపిణీ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు చెట్లను పెంచి పర్యావరణ పరిరక్ష ణకు తోడ్పడాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాయి సురేష్ బాబు. జైలర్. ఉపేందర్ రావ్, జైలర్, మన్మధ రావు డిప్యూటీ జైలర్. ఏం. అశోక్ కుమార్, ఏ డీజే నారాయన, ఏ డీజే జైలు సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- Advertisement -