నవతెలంగాణ – ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామంలో శనివారం రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, అచ్చంపేట శాసనభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రైతుల పక్షపాతిగా మరోసారి నిలిచారని ఈ సందర్భంగా ప్రజలు అభినందించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధి ఫలితంగా సకాలంలో రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు భూములకు అవసరమైన స్ప్రింక్లర్లను ప్రభుత్వం మంజూరు చేసి పంపిణీ చేయడం రైతుల్లో హర్షాతిరేకం నింపింది. “పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ, రైతు మిత్రంగా నిలిచిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు” అని లబ్ధిదారులు కొట్టే శ్రీను, శ్రీనివాసులు, కలమండల తిరుమలయ్య, కొట్టె హరీష్, వెల్టూరి శ్రీకాంత్, చిన్న నాగయ్య, కొట్టే సాయిబాబు, కర్నె లక్ష్మమ్మ, వెల్టూరి చంద్రకళ లాంటి అనేక మంది రైతులు స్ప్రింక్లర్లను అందుకొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ చంద్రశేఖర్, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ వెల్టూరి రేణయ్య, దేవస్థాన డైరెక్టర్ కట్ట శేఖర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు వేల్టూరి రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మొగిలి మహేష్, మాగాని భీమయ్య, కర్నే ఆంజనేయులు, వెల్టూరి కుర్మయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కంసానిపల్లిలో రైతులకు స్ప్రింక్లర్ల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES