- Advertisement -
నవతెలంగాణ- దుబ్బాక
అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ ఎంపీయూపీఎస్ లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న బీ.సంగీత.. కుమారుడు ఇటీవల మరణించగా.సోమవారం అతని జ్ఞాపకార్థంగా తాను చదువు చెప్తున్న పాఠశాలలోని విద్యార్థులకు ఎంఈఓ దోమకొండ అంజయ్య, పాఠశాల హెచ్ఎం డీ.రాధిక చేతుల మీదుగా స్టీల్ ప్లేట్లను పంపిణీ చేయడం జరిగింది. మాజీ సర్పంచ్ బండమీది బాలమణి మల్లయ్య, పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి, టీచర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సుమలత, గ్రామస్తులు రాగుల నారాగౌడ్, స్వామి గౌడ్ పలువురున్నారు.
- Advertisement -