- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించామని వైద్యాధికారి మంజు భార్గవి పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల కేంద్రంతో పాటు పరిధిలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో, విద్యార్థులకు, చిన్నారులకు మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఎన్ డి వి చారి,ఏఎన్ఎం ,అంగన్వాడి టీచర్లు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -