నవతెలంగాణ – పెద్దవూర
మండల లోనిపెద్దగూడెం జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మొదటి రోజు గురువారం పాఠ్యపుస్తకాలు, కిట్లు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు ఉమ్మడి చిన నారాయణ రెడ్డి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు,నోట్ నోట్ బుక్స్, బెల్ట్లతో కూడిన కిట్లను అందజేశారుఈసందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకుధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. విద్యా కోసం ఎంత ఖర్చు అయినా ప్రభు త్వం భరిస్తుందన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి, ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.రేపాల అశోక్,తిరుపతి చంద్రశేఖర్,దాసరి మధుబాబుపల్లా చంద్రకళ,జెల్లా అరుణ,కొల్లి అరుణ,గ్రామ పెద్దలు కూన్ రెడ్డి మంగా రెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES