Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు గురువారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి చేతులమీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతా విద్యార్థుల సౌకర్యార్థం మండల కేంద్రంలో ప్రభుత్వం జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇటీవల పదో తరగతి పాసైన విద్యార్థులు జూనియర్ కళాశాలలో చేరడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థుల కోసం కళాశాలలో అన్ని రకాల వసతులను కల్పిస్తుందన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కూడా కళాశాల అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పేద మధ్య తరగతి విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ తీసుకొని చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ కోశాధికారి నూకల బుచ్చి మల్లయ్య, సభ్యులు వినోద్, కళాశాల అధ్యాపకులు మధు కుమార్, వెంకటేష్, రాజకుమార్, గంగాధర్, వైష్ణవి, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -