Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ : భీంగల్ మండలం, పురనిపేట్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి డ్రెస్ లు ఎంపీడీవో సంతోష్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ పురాణి పెట్ లో ఉన్న పిల్లలందరిని వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకి పంపించాలని వివరించారు. పిల్లల ఆరోగ్యం పై అవగాహన కల్పించి, పిల్లలు టీవీ లు,మొబైల్ చూడకుండా చదువు పై శ్రద్ధ చూపాలి అని చెప్పడం జరిగింది. గ్రామంలో మహిళా సంఘాలు రుణాలతో పాటు సంఘం సమావేశం లో ఆరోగ్యం గురించి సామాజిక అభివృద్ది అంశాలు గురించి స్కూల్ పిల్లలను గవర్నమెంట్ స్కూల్ కి పంపాలని సంఘం సమావేశం లో మాట్లాడుకొని తీర్మానం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వ పథకాలను గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు యువకులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్, సినియార్ సీసీ లు కుంట శ్రీనివాస్, పురస్తు నరేష్, స్కూల్ హెడ్ మాస్టర్, వీడీసీ అద్యక్షులు శ్రీనివాస్,గంగాధర్, కాంగ్రెెస్ పార్టీ నాయకులు దైడి.సురేష్, శీరం అను సాగర్, శివ క్రాంతి, గ్రామ కార్యదర్శి జితేందర్,ఐకేపీ వి వో ఏ కృష్ణ సాగర్. వి వో. అద్యక్షులు శ్యామల,ఐకేపీ మహిళలు, స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -