Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన ఏకరూప దుస్తుల పంపిణీ చేశారు. ఈ మేరకు పాఠశాలలో  నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భోగ రామస్వామి చేతుల మీదుగా విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భోగ రామస్వామి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం ద్వారా కన్న తల్లిదండ్రులతోపాటు గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు అందించే సౌకర్యాలను, వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. రాజేశ్వర్, ఉపాధ్యాయులు పి.చంద్రశేఖర్, క్యాతం శ్యామల, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad