- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
పాపులేషన్ ఎడ్యుకేషన్ సెల్ ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి జానపద నృత్య పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, జడ్పీహెచ్ఎస్ ఆరెగూడెంనకు చెందిన విద్యార్థినిలు ప్రథమ బహుమతి పొంది జిల్లా ఖ్యాతిని చాటారు. ఇట్టి బృందం తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయస్థాయికి ఎంపిక కాబడినది. విద్యార్థులకు శిక్షణ ఇచ్చినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను, విద్యార్థినిలను జిల్లా విద్యాశాఖాధికారి కే సత్యనారాయణ బుదవారం అభినందించారు.
- Advertisement -



