చిరంజీవి నివాసంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆయన స్నేహితులు వెంకటేష్, నాగార్జున అక్కినేని హాజరయ్యారు. వెంకటేష్ భార్య నీరజ, నాగార్జున భార్య అమల కూడా ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్ర కథానాయిక నయనతార కూడా ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు. ఈ ముగ్గురు ఐకానిక్ స్టార్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానుల్లో సందడి నెలకొంది. కాలం మారినా, తరాలు మారినా, వీరి స్నేహం మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందనే భావనను ఈ వేడుక మరోసారి గుర్తుచేసింది.
పండుగ శోభతో చిరంజీవి నివాసం మెరిసిపోయింది. మెగా కుటుంబ సభ్యులు కూడా
ఈ వేడుకలో పాల్గొని ఆనందాన్ని రెట్టింపు చేశారు. ”నా డియర్ ఫ్రెండ్స్ వెంకటేష్, నాగార్జున, నా సహనటి నయనతారతో కలిసి దీపావళిని ఎంతో ఆనందంగా జరుపుకున్నాను, ఇలాంటి క్షణాలే మన హదయాలను సంతోషంతో నింపుతాయి. ప్రేమ, నవ్వులు, ఐక్యత..ఇవే జీవితం నిజంగా వెలుగొందే మూలాలు’ అని చిరంజీవి తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు.
మెగాస్టార్ నివాసంలో ఘనంగా దీపావళి సంబరాలు
- Advertisement -
- Advertisement -