Wednesday, June 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఏసీబీకి ఇవ్వొద్దు

మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఏసీబీకి ఇవ్వొద్దు

- Advertisement -

– కేటీఆర్‌తో న్యాయవాదుల బృందం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మొబైల్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు న్యాయవాదుల బృందం సూచించింది. ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు తీర్పు లేనప్పుడు మొబైల్‌ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదనీ, గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులను వారు ప్రస్తావించారు. ఫార్ములా ఈ కార్‌ రేస్‌ విచారణ సందర్భంగా కేటీఆర్‌ మొబైల్‌ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌ ఇవ్వాలన్న ఏసీబీ అంశంపై ఆయన న్యాయవాదులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాథమికంగా కేటీఆర్‌ న్యాయవాదులు పేర్కొన్న దాని ప్రకారం… ప్రస్తుతం నడుస్తున్న విచారణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నిర్వహించిన క్రీడా కార్యక్రమానికి సంబంధించినది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రేసు నిర్వహణ పూర్తిగా అధికారుల యంత్రాంగం ద్వారా సాగింది. ఇందులో కేటీఆర్‌ నిర్ణయానికి మినహా వ్యక్తిగతంగా పరిమిత పాత్ర మాత్రమే వహించారు.
ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసు అనేది ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్ప, వ్యక్తిగత సంభాషణకు సంబంధించినది కాదని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలతో పాటు ఆయా సంస్థలతో జరిగిన ఒప్పందాలన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయనీ, జరిగిన ప్రతి నగదు లావాదేవీ అధికారికంగా బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు, అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఏసీబీకి లేదని వారు తెలిపారు. ఇవన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సమయంలో కేవలం రాజకీయ వేధింపుల కోణంలో మొబైల్‌ ఫోన్‌ అడగడం వెనుక న్యాయసమ్మతమైన కారణాలు లేవని న్యాయవాదులు పేర్కొ న్నారు.విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరునిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని గతంలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని న్యాయవాదులు గుర్తుచేశారు. పైగా, వ్యక్తిగతంగా వాడే ఫోన్లను ఎలాంటి కోర్టు తీర్పు లేకుండా, వాటితో నేరుగా ఆరోపణల సంబంధం లేనప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అంతేకాక, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం, ఐటీ చట్టం ప్రకారం, ప్రైవసీ హక్కులకు విఘాతం కలిగించేలా ఉంటుందన్నారు. ఈ చట్టాల ప్రకారం కేవలం కోర్టు తీర్పు ఉన్నప్పుడు మాత్రమే విచారణ సంస్థలు మొబైల్‌, ల్యాప్‌ టాప్‌ లాంటి పర్సనల్‌ డివైసులు అడగవచ్చని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -