– ఉన్నత విద్యామండలి చైర్మెన్కు డీవైఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులను పెంచొద్దని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మెన్ ఇటికాల పురుషోత్తంను బుధవారం హైదరాబాద్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు పెంచుకునేందుకు టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యావ్యాపారమే లక్ష్యంగా కాలేజీలు నడుస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా రూ.లక్షల్లో ఫీజులను పెంచుతూ పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయని తెలిపారు. యాజమాన్యాలు సమర్పించే తప్పుడు ఆడిట్ నివేదికల ఆధారంగా, ఆదాయ, వ్యయాలను సృష్టించి ప్రభుత్వాన్ని, టీఏఎఫ్ఆర్సీని కాలేజీలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. పేరున్న ఇంజినీరింగ్ కాలేజీలన్నీ ఖర్చులు పెరిగాయన్న సాకుతో విద్యావ్యాపారానికి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజీలపై ఉన్నత విద్యామండలి తనిఖీల నివేదికను బయటపెట్టాలని కోరారు. ఫీజుల పెంపుతో విద్యార్థులకు భారం కాకుండా ప్రభుత్వం చూడాలని సూచించారు. యాజమాన్యాలు కోరినట్టు ఫీజులను పెంచితే ప్రభుత్వానికి, విద్యార్థులకు భారంగా మారుతుందని తెలిపారు. చదువు పూర్తయినా ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ధ్రువపత్రాలను ఇవ్వడం లేదని విమర్శించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ కాలేజీల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జావీద్, నాయకులు రాజు.
ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు పెంచొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES