- Advertisement -
– మీకు అండగా నేనుంటా
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని నారం వారిగూడెం కాలనీలో కొద్ది రోజుల కిందట భూవివాదం లో దాడికి గురై గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మంగా వెంకటేశ్వరరావు, మంగా గణేష్ లను ఆదివారం మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించారు.
భూ వివాదం పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, ఏదైనా అవసరం నన్ను సంప్రదించాలని వారికి ఆయన బరోసా ఇచ్చారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకన్న బాబు తదితర నాయకులు ఉన్నారు.
- Advertisement -



