వ్యవసాయ శాఖ అధికారులు
నవతెలంగాణ – కన్నాయిగూడెం
మండలంలోని కంతనపల్లి, ముప్పనపల్లి గ్రామాలలో 450 నుండి 500 ఎకరాల సాగు విస్తీర్ణం అవుతున్నట్లు అంచనా. విత్తనం మొక్కజొన్న ఏజెంట్స్ గ్రామాలలో తిరిగి విత్తనం మొక్కజొన్న వేయించటానికి ముందుగా కొంత పెట్టుబడికి కోసం రైతులకు రూ.20000 నుంచి రూ.30000 వరకు రైతులకు ఇచ్చి, రైతులను వారి రైతులుగా నమోదు చేసుకుంటున్నారు. గత సంవత్సరం కొందరు ఏజెంట్స్ రైతులకు డబ్బులు ఇవ్వకుండా కంపెనీ నుంచి వారికి రావలిసిన డబ్బులు తీసుకొని రైతులను చాలా ఇబంది పెట్టారు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ విత్తనాల ఏజెంట్స్ గ్రామాలలో తిరుగుతున్నారు అని మాకు తెలుస్తోంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడటం వలన పెసర, ప్రత్తి ఆశించినంత దిగుబడులు రాకపోవటం వలన విత్తనం మొక్కజొన్న వేసుకొని ఎక్కువ దిగుబడి రాబట్టలాని రైతులు ఆలోచిస్తున్నారు.
అదే ఆసరాగా భావించి అమాయక రైతులకు ఎక్కువ దిగుబడి వస్తాయి మా కంపినీ మొక్కజొన్న విత్తనాలు వేసుకుంటే, పురుగు మందులు మేమే ఇస్తామని ఆశచూపి రైతులతో విత్తన మొక్కజొన్న వేయిస్తున్నారు. మాములు మొక్కజొన్నతో పోలిస్తే విత్తనం మొక్కజొన్నకు పెట్టుబడి ఎక్కువ. రైతులకు ఇచ్చే పురుగు మందులు మన దగ్గర కాకుండా ఎక్కడ నుండో తీసుకొని వస్తారు. చిన్న చిన్న కంపినీల, బయో పురుగు మందులు ఇచ్చేవి రూ.2000 అయితే రూ.5000 అని చెపుతారు. బిల్స్ కూడా కొంత మంది రైతులకు ఇవ్వరు. ఇలా రైతును వితనాలు ఇచ్చిన దగ్గర నుండి చివరి వరకు అన్ని ఎక్కువ ధరలు రాసి రైతలను నిలువునా ముంచుతున్నారు. మొత్తం మొక్కజొన్న కోసిన తరువాత 5 నుండి 10 క్వింటాల్ వస్తే రైతుకు ఏమి మిగలదు. గత సంవత్సరాం కంటే ఈ యాసంగికి ఇంకా ఎక్కువ విత్తన మొక్కజొన్న వేయించడానికి లోకల్ ఏజెంట్స్ కాకుండా బయట ఆంధ్ర వాళ్ళు కూడా వచ్చి గ్రామాలలో తిరుగుతున్నారు.
వారి ప్రలోభాలకు కొందరు అమాయక రైతులు లొంగి విత్తన మొక్కజొన్న వేయడానికి అంగీకరిస్తున్నారు. గత సంవత్సర అన్ని విత్తన కంపినిస్ వారు టార్గెట్ కంటే ఎక్కువ విత్తన మొక్కజొన్న వెయ్యటం వలన వారి గోదాంమ్ లు కూడా నిండి పోయాయని వారు తెలిపారు. మళ్ళీ రైతులు విత్తన మొక్కజొన్న వేస్తే కంపిణీలు తీసుకుంటుందా లేదా అనేది కూడా అర్థం కాని పిరస్థితి. అంతేకాకుండా ఇక్కడ వున్న ఏజెంట్స్ కు కూడా రైతులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. దీంతో రైతులు ఈ విధంగా కూడా భారీగా నష్టపోతున్నారు.
విత్తన మొక్కజొన్న వేసిన రైతు పొలానికి 500 మీటర్స్ వరకు నాటు మొక్కజొన్న వెయ్యకూడదు. ఎవరైనా వేస్తే ఇద్దరు రైతుల మొక్కజొన్న దిగుబడులు తగ్గుతాయనే విషయం మొక్కజొన్న ఏజెంట్స్ కు కూడా తెలియదు. కొందరు ఏజెంట్స్ రైతు దగ్గర మాత్రం అగ్రిమెంట్ తీసుకుంటారు..ఎందుకంటే నువ్వు పండించిన మొక్కజొన్న నాకే ఇవ్వాలి.. నాకు కాకుండా వేరే వారికీ ఇస్తే చట్ట పరంగా మీ మీద ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు కూడా గురిచేస్తారు. మరికొందరు ఏజెంట్స్ మొక్కజొన్న కోత తరువాత 10 రోజులలో వారికి డబ్బులు ఇవ్వాలి.. కానీ నెలలు నెలలు వారిని తిప్పుకొని డబ్బులు ఇచ్చారు. రైతులకు వ్యవసాయ శాఖ నుండి ఒకటే విన్నపము.. అగ్రిమెంట్ ఇస్తే విత్తనం మొక్కజొన్న వేసుకోండి లేదా నాటు మొక్కజొన్న వేసుకోండి.
ఏజెంట్స్ పాటించు వలిసిన నియమాలు
1) ఏజెంట్ తప్పకుండా లోకల్ వారు అయి ఉండాలి
2) విత్తనాలు వేసే టప్పుడు మీ కంపినీ సిబంది దెగ్గర ఉండి విత్తనాలు వేపించాలి
3) వారానికి ఒకసారి రైతు పొలం దెగ్గరకు వెళ్లి సలహాలు చూచనలు ఇవ్వాలి
4) పొలం లో ఏమయినా సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి అంటే రైతుకి వెంటనే చెప్పి చేఇంచాలి
5) డీ టాసాలింగ్ సమయాణికు చేపించాలి,లేకపోతే దిగుబడులు సగానికి సగం తగ్గుతాయి, రైతు నష్ట పోతారు
6) రైతులకు ఇచ్చే కలుపు మందులు పురుగు మందులు తప్పకుండా లోకల్ వున్న పురుగుమందుల షాప్ ల వద్ద మాత్రమే తీసుకోవాలి లేదా మీరే పురుమందుల లైసెన్స్ తీసుకొని రైతులకు ఇవ్వవచ్చు
7)రైతుల నుండి మీరు అగ్రిమెంట్ ఎలా తీసుకుంటున్నారో అలాగే రైతుకి కూడా తప్పకుండా అగ్రిమెంట్ ఇవ్వాలి
8) వ్యవసాయ పట్టు భద్రులను నియమించుకొని రైతులకు ఎప్పటి కప్పుడు సలహాలు ఇవ్వాలి
9) రైతుల పంటకోత తరువాత ఎంత దిగుబడి వచ్చినది అన్న రసీదు ఇచ్చిన 10 రోజుల లోపు రైతుకు ఖాతాలోకి డబ్బులు ఇవ్వాలి
10) ఏజెంట్స్ రైతుకు నష్టం జరిగే పని ఏమి చేసిన చట్ట పరంగా వారి మీద చర్యలు ఉంటాయి అగ్రికల్చర్ అధికారులు హెచ్చరించారు



