డాక్టర్ గోపాలరావు జిల్లా వైద్యాధికారి
నవతెలంగాణ – గోవిందరావుపేట : వైద్యులు ప్రతిరోజు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు అన్నారు. సోమవారం మండలంలోని పసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు సందర్శించి పలు రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ముందుగా ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆస్పత్రికి డాక్టర్ రాకపోవడంతో జిల్లా వైద్యాధికారి కి మరియు జిల్లా ఉపవైద్యాధికారిలకు సమాచారం అందించారు.
9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రి పని చేయు వేళలలో డాక్టర్ ఉదయం 10 గంటల తరువాత వచ్చి మధ్యాహ్నం ఒంటిగంట రెండు గంటల వరకు వెళ్లిపోతున్నారని ఒకరోజు ప్రధాన వైద్యాధికారి మరో రోజు ఆయుష్ డాక్టర్ ఓపి చూస్తున్నారని తెలిపారు. ఆయుర్వేదిక్ డాక్టర్ ఇంగ్లీష్ మందులకు ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జిల్లా వైద్యాధికారి ఆస్పత్రిని విజిట్ చేసి రికార్డులను ఫార్మసీ ల్యాబ్ పరిశీలించి వర్షాకాలం అయినందున సకాలంలో వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు. మరోసారి కంప్లైంట్ రాకుండా ఉండాలని అన్నారు. వైద్యాధికారి పరిశీలన సమయంలో ఆస్పత్రిలో ఆయుష్ వైద్యురాలు మరియు ఎన్సీడీ స్టాఫ్ నర్స్ మరియు స్టాఫ్ నర్సు సిబ్బంది ఉన్నారు.
వైద్యులు సమయపాలన పాటించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES