- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాలుకు గాయమైందని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన పరమేష్(25) ఈ నెల 5న కుడికాలు పాదానికి రేకు గీసుకొని గాయమైంది. ఓ ప్రయివేటు ఆస్పత్రిలో అతడికి సర్జరీ చేశారు. 9న వైద్యులు అతడి మెదడులో రక్తస్రావమైందని అనడంతో కుటుంబసభ్యులు సర్జరీకి రూ.3 లక్షలు ఇచ్చారు. శనివారం పరమేష్ పరిస్థితి విషమంగా ఉందనడంతో గాంధీకి తరలించారు. అక్కడి వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.
- Advertisement -