- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య బహుజన ఆత్మగౌరవ ప్రతీక అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈమేరకు శుక్రవారం సీఎం తన ఎక్స్ ఖాతాల్లో పోస్టు చేశారు. ఆనాటి నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారని గుర్తు చేశారు. సమానత్వం, న్యాయం కోసం పోరాడిన దొడ్డి కొమురయ్యను స్ఫూర్తిగా తీసుకుని, అణగారిన వర్గాల అభున్నతి, సమాన హక్కుల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -



