Thursday, June 5, 2025
E-PAPER
Homeజాతీయంనష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ సూచీలు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ … వాణిజ్య ఆందోళనల కారణంగా తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దీంతో తొలుత లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఇప్పుడు నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 153 పాయింట్ల నష్టంతో 81,184 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 24,664 వద్ద ఉన్నాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో.. అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎటర్నల్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టైటాన్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

డాలరుతో రూపాయి మారకం విలువ 85.55 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 64.95 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,364 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 500.. 0.41 శాతం, నాస్‌డాక్‌ 0.67 శాతం, డోజోన్స్‌ 0.08 శాతం లాభపడ్డాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు అదే బాటలో పయనిస్తున్నాయి. హాంగ్‌సెంగ్‌ 1.41 శాతం, షాంఘై 0.52 శాతం, ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.39 శాతం, జపాన్‌ నిక్కీ 0.20 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికరంగా రూ.2,589 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా.. దేశీయ సంస్థాగత మదుపర్లు నికరంగా రూ.5,314 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -