నవతెలంగాణ – కంఠేశ్వర్ : రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలియజేశారు. ఏ మేరకు గురువారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని కోట గల్లీలో గల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన జిల్ల విద్యాశాఖ అధికారి అశోక్ మాట్లాడుతూ.. రక్తదానం అన్ని దానలకన్న గొప్పదని, రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీను అభినందిస్తూ,ప్రతి పాఠశాలలో రక్తదాన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సుమారుగా 40 మంది రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకం అని దానిలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల విద్యశాఖ అధికారి సాయిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, సభ్యులు తోట రాజశేఖర్, రవి స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం చేసి ప్రాణదాతలవ్వండి: డీఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES