- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట గ్రామ మాజీ సర్పంచ్, మండల మాజీ ఎంపిపి, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి మాతృమూర్తి ఐత లక్ష్మీ బాయి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందారు. అయితే లక్ష్మీ బాయి నేత్రాలు కుమారులు ఐత కరుణాకర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డిలు సదాశయా ఫౌండేషన్ కు దానం చేశారు. ఈ కార్యక్రమంలో నుక రమేష్, పి.ప్రదీప్ టెక్నీషియన్ ఎల్వి ప్రసాద్ పాల్గొన్నారు.
- Advertisement -