నవతెలంగాణ – పెద్దవూర
దాతలు పాఠశాల కు విద్యా సామగ్రి పంపిణీ చేయడం అభినందనీయమని ఎంఈఒ తరి రాము అన్నారు. సోమవారం మండలం లోని పినవూర ప్రాధమిక పాఠశాల లో దాతలు సహకారంతో అందించి విద్యాసామాగ్రి 20 మంది విద్యార్థులకు పంపిణి చేసి మాట్లాడారు. గ్రామానికి చెందిన గద్దల అశోక్,తేరా వెంకట్ రెడ్డి,ఎలిజర్ల సందీప్ 20 వేల విలువైన స్కూల్ బ్యాగులు, టై, బెల్టు, ఐడెంటి కార్డు, మరియు పాఠశాలకు సౌండ్ బాక్స్, స్పీకర్ లను ఉచితంగా అందిచడం ఎంతో శుభ సూచకమని అన్నారు. విద్యార్థులు దాతలు అందించిన విద్యా సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకా దాతలు పాఠశాల అభివృద్ధి లో ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. పాఠశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ప్రధానో పాధ్యాయులు గోలి కృష్ణనుదాతలను ఎంఈఓ తరి రాము ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులుకోటేష్,శ్గ్రామ పెద్దలు నాగరాజు,గిరి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
దాతల సహకారం అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES