- Advertisement -
తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు : అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు అన్నారు. మండలంలోని కిషన్ రావు పల్లిలో దండిగ కొమురయ్య, బొంతల మోక్షేత అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా సోమవారం బాధితల కుటుంబాలను పరామర్శించి, అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వర దేవస్థానం డైరెక్టర్ నర్సింగరావు, కాంగ్రెస్ నాయకులు రాజునాయక్, జక్కుల వెంకటస్వామి పాల్గొన్నారు.
- Advertisement -