- Advertisement -
మాజీ ఎంపీపీ మలహల్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని నారాయణపెళ్లికి చెందిన కీర్తి లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు శుక్రవారం మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజునాయక్, కాంగ్రెస్ నాయకులు రాజమొగిలి, రాజయ్య, కీర్తి సంపత్, రాజేష్ పాల్గొన్నారు.
- Advertisement -



