- Advertisement -
రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు : అధైర్య పడొద్దు ప్రభుత్వం ఆన్నివిధాలా అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారభించారు. అనంతరం తాడిచర్ల, కిషన్ రావు పల్లి గ్రామాల్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బొబ్బిలి కౌసల్యతోపాటు పలువురు మృతుల కుటుంబాలను ఓదార్చి, వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చింతలపల్లి మలహల్ రావు, యూత్ నాయకులు బొబ్బిలి రాజు గౌడ్, ఆర్ని ఉదయ్, ప్రభాకర్ పాల్గొన్నారు.
- Advertisement -