- Advertisement -
యూరియా స్టాక్ ను పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ – మిర్యాలగూడ
యూరియా కంపెనీలో రైతులకు ఇబ్బందులు కలిగించకూడదని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు గ్రామంలో ఉన్న ఎన్ డి ఆర్, ఎన్డీసీఎంఎస్ ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి, యూరియా అందుబాటును పరిశీలించారు. రైతులతో మాట్లాడి, యూరియా యాప్ పనితీరును కూడా తెలుసుకొన్నారు. సకాలంలో రైతులకు యూరియా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సైదా నాయక్ అర్ ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



