- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
హైదరాబాదులో హైటెక్ సిటీలో జరిగినటువంటి తెలంగాణ డాక్టర్స్ ఎక్సలెన్స్ 2025 అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా కు చెందిన మాతృశ్రీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా, శ్రావణిక రెడ్డి ఎంపిక అయ్యారు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ట్ రిటార్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఈటెల రాజెందర్ తో పాటు కాంగ్రెస్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవార్డు కి ఎంపిక చేయడం మరువలేని సందర్భంగా చాలా సంతోషంగా వుందని డా, శ్రావణిక రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
- Advertisement -



